కావలసిన పదార్ధాలు:
పెరుగు 3 కప్పులు, కుంచెం అల్లం, 5 వెల్లుల్లి ముక్కలు, 2 పచ్చి మిరపకాయలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ధనియాలు, తగినంత ఉప్పు. తాలింపుకి - నూనె 1 టీ స్పూన్, ఆవాలు అర టీ స్పూన్, కరివేపాకు 5-6 ఆకులు, చిటికెడు ఇంగువ.
తయారు చేసే విధానం:
ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చి మిరపకాయలు, జీలకర్ర, ధనియాలను గ్రైండ్ చేసి పేస్టుల చేసుకోవాలి. ఈ పేస్టును పెరుగు, ఉప్పు వేసి అవసరమైనన్ని నీళ్ళు పోసి బాగా కలపాలి. తరువాత ఒక కడాయిలో నూనె పోసి అందులో ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు వేయాలి. ఈ తాలింపుని ముందుగా చేసుకున్న పెరుగు మిశ్రమానికి కలుపి చల్లార్చాలి. అంతే మసాల మజ్జిగ రెడీ.